జార్ఖండ్ అసెంబ్లీ వాయిదా

జార్ఖండ్ రాజధాని రాంచీలో జేపీఎస్సీ-జేఎస్ఎస్సీ అభ్యర్థులు ‘విధానసభ ఘేరావ్’ మార్చ్ చేపట్టారు. అసెంబ్లీని ముట్టడించాలని ప్రయ్నతించినవాళ్లను పోలీసులు అడ్డుకున్నారు. వారి మీద వాటర్ క్యానెన్స్, టియర్ గ్యాస్ ప్రయోగించి, లాఠీచార్జ్ చేశారు. పోలీసులు-విద్యార్థుల మధ్య తోపులాట జరిగి పరిస్థితి ఉద్రిక్తంగా మారింది. దీంతో అసెంబ్లీని స్పీకర్ వాయిదా వేశారు.



