14 రోజుల పసిపాపను మట్టిలో పూడ్చేశారు.. తర్వాత ఏమైందో తెలుసా?

పుట్టిన 14 రోజులకే తల్లి చనిపోవడంతో, పెంచడం భారమనుకున్న తండ్రి పాపను బతికుండగానే తల్లి శవం కాల్చిన వాగు ఒడ్డున మట్టిలో పూడ్చిపెట్టి వెళ్ళిపోయాడు. అదృష్టవశాత్తూ ఆమె తాత ఊపిరి పీల్చుకోవడం చూసి మట్టిలోంచి బయటకు తీసి కాపాడారు. పశువుల కొట్టంలో ఉంటూ, మేక పాలు పోసి ఆమెను పెంచి పెద్దచేశారు. ఎన్నో కష్టాల మధ్య చదువుకుని నర్సుగా మారిన సునీత, 70 ఏళ్ల క్రితం చావు అంచుల వరకు వెళ్లొచ్చిన తన అనుభవంతో ప్రస్తుతం ఆడపిల్లల భ్రూణహత్యలు, శిశు హత్యలకు వ్యతిరేకంగా పోరాడుతున్నారు.


