‘విక్టోరియా మెమోరియల్’..చరిత్ర తెలుసా?

హైదరాబాద్ మెట్రో మార్గంలో విక్టోరియా మెమోరియల్ స్టేషన్ ఒకటి. చైతన్యపురి, ఎల్బీనగర్ స్టేషన్ల మధ్యలో ఉండే స్టేషన్ ఇది. ‘విక్టోరియా మెమోరియల్’ చరిత్రేమిటో తెలుసా? 1901లో హైదరాబాద్ నిజాం మహబూబ్ అలీ ఖాన్ సరూర్నగర్లో ‘మహల్-ఎ-సరూర్నగర్’ అనే భవన నిర్మాణం మొదలుపెట్టి, అసంపూర్తిగా వదిలేశారు. 1901 జనవరిలో క్వీన్ విక్టోరియా మరణించారు. అప్పటి బ్రిటిష్ రెసిడెంట్ డేవిడ్ బార్ నిజాంను కోరి, ఆ భవనాన్ని పూర్తి చేసి ‘Victoria Memorial Orphange’గా మార్చారు. ఇప్పటికీ అది విక్టోరియా మెమోరియల్ హోమ్గా కొనసాగుతోంది.


