← Back to news

చరిత్రలో తొలిసారి వందేమాతరం..ఎర్రకోట ముస్తాబు

By Mahesh· 15 Aug 2026
చరిత్రలో తొలిసారి వందేమాతరం..ఎర్రకోట ముస్తాబు

దేశ 80వ స్వాతంత్ర్య దినోత్సవ వేడుకలకు భారత్ సిద్ధమైంది. శనివారం ఆగస్టు 15న న్యూదిల్లీలోని ఎర్రకోట వేదికగా ప్రధాని నరేంద్ర మోదీ వరుసగా 13వసారి జాతీయ జెండాను ఎగురవేయనున్నారు. తరువాత జాతినుద్దేశించి ప్రసంగిస్తారు. ఈసారి వేడుకల్లో తొలిసారిగా వందేమాతరం గేయాన్ని ఆలపించనున్నారు. మరోవైపు ఎర్రకోట పరిసరాల్లో హై సెక్యూరిటీ ఏర్పాటు చేశారు. వెయ్యి సీసీటీవీ కెమెరాలు, ఫేషియల్ రికగ్నిషన్ కెమెరాలతో నిఘా పెంచారు.

More in National

జంతర్ మంతర్ దాడి కేసు.. అదుపులో స్వతంత్ర భారద్వాజ్
National· 9h ago

జంతర్ మంతర్ దాడి కేసు.. అదుపులో స్వతంత్ర భారద్వాజ్

CJP ప్రొటెస్ట్‌లో దాడి చేశారని ఆరోపణలు ఎదుర్కొంటున్న యాక్టివిస్ట్ స్వతంత్ర భారద్వాజ్‌ను UPలో పోలీసులు డిటెయిన్ చేశారు. బులంద్‌షహర్‌లో ఆయనను అదుపులోకి తీసుకున్నట్లు తెలుస్తోంది. జంతర్ మంతర్ ప్రొటెస్ట్‌లో నిషు ఆజాద్ తండ్రి సంజయ్ కుమార్‌తో గొడవ జరిగిందని, ఆయనపై దాడి చేశారనే ఆరోపణలు ఉన్నాయి. దాడి కేసులో CJP ప్రతినిధులు <a href="https://www.theclearcutnews.com/n/WKSsto7">పార్లమెంట్ స్ట్రీట్ పోలీస్ స్టేషన్‌కు</a> వెళ్లారు. మర్డర్ అటెంప్ట్ సెక్షన్, SC/ST యాక్ట్‌ కింద కేసు పెట్టాలని పోలీసులను కోరారు. దీంతో పోలీసులు యాక్షన్ తీసుకున్నట్లు తెలుస్తోంది.