KTRకు కాంగ్రెస్ బర్త్డే కానుక

TG: మాజీ మంత్రి KTR బర్త్ డే సందర్భంగా కానుకగా రేవంత్రెడ్డి సర్కార్ సన్నబియ్యాన్ని పంపించింది. రాష్ట్ర ఫిషరీస్ కార్పొరేషన్ చైర్మన్ మెట్టు సాయికుమార్, కాంగ్రెస్ ప్రభుత్వం తరఫున 25కిలోల బియ్యాన్ని KTR పేరుతో HYDలోని తెలంగాణ భవన్కు ర్యాపిడో ద్వారా పంపించారు. దేశంలో సన్నబియ్యం పంపిణీ చేస్తున్న ఏకైక రాష్ట్రం తెలంగాణేనని ఆయన పేర్కొన్నారు. ఇటీవల KTR ఓ నిరుపేద కుటుంబం ఇంట్లో సన్నబియ్యంతో భోజనం చేసినందుకు ధన్యవాదాలు తెలిపారు. అవసరమైతే ప్రతి నెలా ఇలాగే సన్నబియ్యం పంపేందుకు సిద్ధమని చెప్పారు.



