చక్కెర ధర కట్టడికి కేంద్రం బిగ్ ప్లాన్!

పండుగల సీజన్ ముందర దేశంలో చక్కెర ధరలు రికార్డు స్థాయికి పెరగడంతో కేంద్ర ప్రభుత్వం అలర్ట్ అయ్యింది. మహారాష్ట్రలోని కొల్హాపూర్లో క్వింటాల్ హోల్సేల్ ధర రూ.5,350కి చేరగా, రిటైల్ ప్రైస్ కిలో రూ.52.30 దాటింది. దీంతో కేంద్రం రేట్లను కంట్రోల్ చేయడానికి టాక్స్ (ఇంపోర్ట్ డ్యూటీ) లేకుండా 10 లక్షల మెట్రిక్ టన్నుల షుగర్ దిగుమతికి పర్మిషన్ ఇవ్వడం, పెద్ద వ్యాపారుల నిల్వలపై లిమిట్స్ విధించడం, మిల్లుల నెలవారీ సేల్స్లో మార్పులు చేయడం లాంటి పలు చర్యలు తీసుకునే అవకాశం ఉంది.


