← Back to news

ధరల నియంత్రణకు ప్రభుత్వం బిగ్ స్టెప్

By dk· 3 Aug 2026· విజయవాడ
ధరల నియంత్రణకు ప్రభుత్వం బిగ్ స్టెప్

AP: బియ్యం ధరల పెరుగుదలను నియంత్రించేందుకు కూటమి ప్రభుత్వం ప్రత్యేక చర్యలు చేపట్టిందని మంత్రి నాదెండ్ల మనోహర్ తెలిపారు. విజయవాడ ఆటోనగర్ APIIC రైతు బజార్‌లో మాట్లాడుతూ, రాష్ట్రవ్యాప్తంగా 150 రైతు బజార్లు, 500 రైస్ మిల్ అవుట్‌లెట్లలో ఆదివారం నుంచి సబ్సిడీ ధరలకు నాణ్యమైన బియ్యం విక్రయాలు ప్రారంభించినట్లు వెల్లడించారు. BPT స్టీమ్ రైస్‌ను కిలో రూ.52కు, BPT పచ్చి బియ్యాన్ని రూ.50కు అందుబాటులోకి తీసుకొచ్చామని చెప్పారు. కందిపప్పు, పామాయిల్ ధరల నియంత్రణపైనా ప్రభుత్వం దృష్టి సారించిందన్నారు.

More in AP