← Back to news

బంగారం, వెండి ధరలకు బ్రేక్.. దిగొస్తున్న రేట్లు

By Mahesh· 28 Aug 2026
బంగారం, వెండి ధరలకు బ్రేక్.. దిగొస్తున్న రేట్లు

దేశంలో గోల్డ్, సిల్వర్ రేట్లు క్రమంగా తగ్గుముఖం పడుతున్నాయి. ఈరోజు ఉదయం 6:30 గం. సమయానికి దిల్లీలో 24 క్యారెట్ల 10 గ్రా. బంగారం రూ.1,63,120, 22 క్యారెట్ల గోల్డ్ రూ.1,49,540గా నమోదైంది. కిలో వెండి రూ.2,59,900కి పడిపోయింది. ముంబైలో 24 క్యారెట్ల బంగారం రూ.1,62,970, 22 క్యారెట్ల ధర రూ.1,49,390గా ఉంది. హైదరాబాద్, విజయవాడ, విశాఖలోనూ ఇదే బంగారం ధరలు కొనసాగగా.. కిలో వెండి రూ.2,64,900గా నమోదైంది. గోల్డ్, సిల్వర్ రేట్స్ ఎప్పటికప్పుడు మారుతుంటాయి కాబట్టి కొనే ముందు మార్కెట్‌లో ఒకసారి చెక్ చేసుకోవడం బెటర్.

More in National

జంతర్ మంతర్ దాడి కేసు.. అదుపులో స్వతంత్ర భారద్వాజ్
National· 3h ago

జంతర్ మంతర్ దాడి కేసు.. అదుపులో స్వతంత్ర భారద్వాజ్

CJP ప్రొటెస్ట్‌లో దాడి చేశారని ఆరోపణలు ఎదుర్కొంటున్న యాక్టివిస్ట్ స్వతంత్ర భారద్వాజ్‌ను UPలో పోలీసులు డిటెయిన్ చేశారు. బులంద్‌షహర్‌లో ఆయనను అదుపులోకి తీసుకున్నట్లు తెలుస్తోంది. జంతర్ మంతర్ ప్రొటెస్ట్‌లో నిషు ఆజాద్ తండ్రి సంజయ్ కుమార్‌తో గొడవ జరిగిందని, ఆయనపై దాడి చేశారనే ఆరోపణలు ఉన్నాయి. దాడి కేసులో CJP ప్రతినిధులు <a href="https://www.theclearcutnews.com/n/WKSsto7">పార్లమెంట్ స్ట్రీట్ పోలీస్ స్టేషన్‌కు</a> వెళ్లారు. మర్డర్ అటెంప్ట్ సెక్షన్, SC/ST యాక్ట్‌ కింద కేసు పెట్టాలని పోలీసులను కోరారు. దీంతో పోలీసులు యాక్షన్ తీసుకున్నట్లు తెలుస్తోంది.