చెత్త వాహనాల పెట్రోల్ చోరీ.. ఇద్దరు డ్రైవర్లపై కేసు!

జగిత్యాల పట్టణంలో మున్సిపల్ చెత్త వాహనాల నుంచే పెట్రోల్ చోరీ! విద్యానగర్ వాటర్ ట్యాంక్ వద్ద ఇద్దరు డ్రైవర్లు పెట్రోల్ తీస్తుండగా పట్టుబడ్డారు. అవుట్సోర్సింగ్ డ్రైవర్లు ఇప్పటివరకు 83 లీటర్ల పెట్రోల్ తీశారని, దాదాపు రూ.10 వేల విలువ చేస్తుందని టౌన్ సీఐ పి.కరుణాకర్ చెప్పారు. కేసు నమోదు చేశారు. ఎస్సై జి.మహేష్ దర్యాప్తు చేస్తున్నారు.



