మినిస్టర్ ముందే సూసైడ్ అటెంప్ట్!
వైఎస్సార్ కడప జిల్లాలో మంత్రి సావిత్రి ఆధ్వర్యంలో జరిగిన కూటమి రివ్యూ మీటింగ్లో ఒక ఘోరమైన ఘటన జరిగింది. కూటమి ప్రభుత్వం వచ్చినప్పటికీ పార్టీ కోసం కష్టపడిన కార్యకర్తలకు న్యాయం జరగడం లేదంటూ. తీవ్ర మనస్తాపంతో ఒక TDP కార్యకర్త మీటింగ్లోనే పురుగుల మందు తాగి ఆత్మహత్యాయత్నం చేశాడు. అయితే, ఆ కార్యకర్త అంత పెద్ద ప్రాణాపాయ స్థితిలో ఉన్నా కూడా మంత్రి సావిత్రి మాత్రం దాన్ని పట్టించుకోకుండా తన స్పీచ్ను కంటిన్యూ చేయడం ఇప్పుడు తీవ్ర చర్చనీయాంశంగా మారింది.



