ఏఐతో పిల్లలకు పారా సోషల్ అటాచ్ మెంట్

టెక్నాలజీ యుగంలో పిల్లలు మానవ సంబంధాల కంటే ఆర్టిఫిషియల్ ఇంటెలిజెన్స్ (AI) పరికరాలకే ఎక్కువగా అలవాటు పడుతున్నారు. ఇది వారిలో 'పారాసోషల్ అటాచ్మెంట్' (కల్పిత బంధం) పెంచుతూ, నిజమైన భావోద్వేగాలను, సామాజిక నైపుణ్యాలను దూరం చేస్తోంది. డిజిటల్ పరికరాల మితిమీరిన వాడకం వల్ల పిల్లల్లో సానుభూతి లోపించడం, ఒంటరితనం వంటి కొత్త మానసిక సవాళ్లు ఎదురవుతున్నాయి. తల్లిదండ్రులు పిల్లలతో గడుపుతూ ఈ డిజిటల్ దూరాన్ని తగ్గించాల్సిన అవసరం ఎంతైనా ఉంది.



