← Back to news

పొట్టకూటి కోసం వెళ్లి.. ప్రాణాలు కోల్పోయిన 8 మంది

By Mahesh· 18 Aug 2026· Madhya Pradesh
పొట్టకూటి కోసం వెళ్లి.. ప్రాణాలు కోల్పోయిన 8 మంది

మధ్యప్రదేశ్‌ రాష్ట్రం భీండ్ జిల్లాలో ఈరోజు ఉదయం ఘోర రోడ్డు ప్రమాదం జరిగింది. గ్వాలియర్–భీండ్ నేషనల్ హైవేపై ఛిమ్కా గ్రామం దగ్గరలో కూలీలతో వెళ్తున్న పికప్ వెహికల్ ఎదురుగా వస్తున్న డంపర్‌ను ఢీకొట్టింది. ఈ ప్రమాదంలో 8 మంది కూలీలు మృతి చెందారు. మరో 32 మందికి గాయాలయ్యాయి. గ్వాలియర్‌లో వరి నాట్లు పనులు ముగించుకుని ఉత్తరప్రదేశ్‌లోని లఖింపూర్ ఖేరీకి తిరిగి వెళ్తుండగా ప్రమాదం జరిగింది. రోడ్డుపై ఉన్న పశువులను తప్పించేందుకు డ్రైవర్ వాహనంపై పట్టు కోల్పోయినట్లు పోలీసులు గుర్తించారు.

More in National

జంతర్ మంతర్ దాడి కేసు.. అదుపులో స్వతంత్ర భారద్వాజ్
National· 8h ago

జంతర్ మంతర్ దాడి కేసు.. అదుపులో స్వతంత్ర భారద్వాజ్

CJP ప్రొటెస్ట్‌లో దాడి చేశారని ఆరోపణలు ఎదుర్కొంటున్న యాక్టివిస్ట్ స్వతంత్ర భారద్వాజ్‌ను UPలో పోలీసులు డిటెయిన్ చేశారు. బులంద్‌షహర్‌లో ఆయనను అదుపులోకి తీసుకున్నట్లు తెలుస్తోంది. జంతర్ మంతర్ ప్రొటెస్ట్‌లో నిషు ఆజాద్ తండ్రి సంజయ్ కుమార్‌తో గొడవ జరిగిందని, ఆయనపై దాడి చేశారనే ఆరోపణలు ఉన్నాయి. దాడి కేసులో CJP ప్రతినిధులు <a href="https://www.theclearcutnews.com/n/WKSsto7">పార్లమెంట్ స్ట్రీట్ పోలీస్ స్టేషన్‌కు</a> వెళ్లారు. మర్డర్ అటెంప్ట్ సెక్షన్, SC/ST యాక్ట్‌ కింద కేసు పెట్టాలని పోలీసులను కోరారు. దీంతో పోలీసులు యాక్షన్ తీసుకున్నట్లు తెలుస్తోంది.