పానీపూరి తిన్న చిన్నారులకు అస్వస్థత

TG: రాజన్నసిరిసిల్ల జిల్లా తంగళ్లపల్లి మండలం KCRనగర్ కాలనీలో గప్చుప్ తిన్న పలువురు చిన్నారులు అస్వస్థతకు గురయ్యారు. వెంటనే వారిని జిల్లా గవర్నమెంట్ హాస్పిటల్కు తరలించారు. పానీపూరి తిన్న చిన్నారులకు వాంతులు, విరేచనాలు, కడుపునొప్పి వంటి లక్షణాలు కనిపించాయి. వెంటనే తల్లిదండ్రులు చిన్నారులను మొదటగా జిల్లా ప్రభుత్వ ఆసుపత్రికి తర్వాత ప్రైవేట్ హాస్పిటల్స్కు తరలించారు. ప్రస్తుతం చిన్నారుల పరిస్థితి నిలకడగా ఉందని డాక్టర్స్ తెలిపారు.



