ముంబైలో గంగపుత్రుల బోనాల పండుగ

ముంబయిలోని అంధేరీ గావ్దేవి గంగపుత్ర బెస్త సంఘం బోనాల ఉత్సవం ఘనంగా నిర్వహించింది. అంధేరీ డోంగరి ప్రాంతంలోని ఎల్లమ్మ దేవి గుట్ట చుట్టూ మహిళలు బోనాలతో ముందుకు సాగారు. ఈ ప్రాంతంలో తెలంగాణ నుంచి నల్గొండ, యాదాద్రి, వరంగల్, యాదగిరి జిల్లాల నుంచి వచ్చినవారు ఈ వేడుకలో పాల్గొన్నారు. ఈ బోనాల ఉత్సవం గత 65 ఏళ్ల నుంచి కొనసాగిస్తున్నామని సంఘం అధ్యక్షుడు మంగిలిపెల్లి శ్రీనివాస్ గంగపుత్ర తెలిపారు.



