← Back to news

రైతులు అధైర్యపడొద్దు.. ప్రభుత్వం అండగా ఉంటుంది

By Kothapalli Mahesh· 20 Aug 2026· Doulathabad, Doulathabad, Vikarabad
రైతులు అధైర్యపడొద్దు.. ప్రభుత్వం అండగా ఉంటుంది

TG: మక్తల్–నారాయణపేట్–కొడంగల్ లిఫ్ట్ ఇరిగేషన్ ప్రాజెక్టులో భూములు కోల్పోతున్న రైతులకు ప్రభుత్వం అండగా ఉంటుందని యూత్ కాంగ్రెస్ కొడంగల్ అధ్యక్షుడు రెడ్డి శ్రీనివాస్ భరోసా ఇచ్చారు. వికారాబాద్ జిల్లా దౌలతాబాద్ మండలం గోఖపసల్వాడ్ గ్రామంలో నిర్వహించిన గ్రామ సభలో ఆయన మాట్లాడారు. ప్రాజెక్టు నిర్మాణం కోసం భూములు కోల్పోతున్న రైతులు ఎలాంటి ఆందోళనకు గురికావాల్సిన అవసరం లేదని తెలిపారు. ప్రభుత్వం నిబంధనల ప్రకారం తగిన పరిహారం అందించడంతో పాటు పునరావాస సౌకర్యాలు కూడా కల్పిస్తుందని చెప్పారు.

More in Local