← Back to news

రూ.40 లక్షల అభివృద్ధి పనులు ప్రారంభం

By krshekar kr47· 21 Aug 2026· Adloor Yellareddy, Sadashivanagar, Kamareddy
రూ.40 లక్షల అభివృద్ధి పనులు ప్రారంభం

TG: కామారెడ్డి జిల్లా సదాశివనగర్ మండలం మల్లుపేట్ గ్రామంలో నిర్మించిన మహిళా సమాఖ్య భవనం, సీసీ రోడ్డు, నూతన గ్రామపంచాయతీ భవనాలను ఎల్లారెడ్డి ఎమ్మెల్యే మదన్ మోహన్ ప్రారంభించారు. మహిళా సమాఖ్య భవనానికి రూ.10 లక్షలు, సీసీ రోడ్డుకు రూ.10 లక్షలు, గ్రామపంచాయతీ భవన నిర్మాణానికి రూ.20 లక్షలు ఖర్చు చేశారు. ఎమ్మెల్యే మాట్లాడుతూ.. గ్రామీణ ప్రాంతాల్లో మౌలిక వసతుల అభివృద్ధికి ప్రభుత్వం ప్రత్యేక ప్రాధాన్యం ఇస్తోందన్నారు. ప్రజలకు అవసరమైన సౌకర్యాలను మెరుగుపరచడమే లక్ష్యంగా అభివృద్ధి పనులు చేపడుతున్నట్లు తెలిపారు.

More in Local