ఎర్రకోటపై 'వందేమాతరం' 150 ఏళ్ల పండగ!

ఈ ఆగస్టు 15న మనదేశం 80వ స్వాతంత్య్ర దినోత్సవాన్ని జరుపుకోబోతోంది. ఢిల్లీ ఎర్రకోటపై ప్రధాని మోదీ జెండా ఎగరేసి జాతిని ఉద్దేశించి మాట్లాడతారు. ఈసారి ప్రత్యేకత ఏంటంటే.. 'వందేమాతరం' 150 ఏళ్లు పూర్తవుతున్న సందర్భంగా లక్షలాది మందికి స్ఫూర్తినిచ్చిన ఈ జాతీయ గేయాన్ని ఎర్రకోట బురుజుల నుంచి తొలిసారిగా పాడతారు. హెలికాప్టర్ ద్వారా పూలవాన కురిపిస్తూ వందేమాతరం బ్యానర్ను చూపిస్తారు. 'యువశక్తి'కి ప్రాధాన్యమిస్తూ 2,500 మంది NCC, మై భారత్ వాలంటీర్లు జ్ఞాన్పథ్లో ప్రత్యేక ప్రదర్శన ఇవ్వనున్నారు.



