← Back to news

ఏబీవీపీ ద్వారా రాజకీయాల్లోకి వచ్చిన ప్రధాన్

By RK· 25 Jul 2026
ఏబీవీపీ ద్వారా రాజకీయాల్లోకి వచ్చిన ప్రధాన్

కొన్నాళ్లుగా దేశంలో ధర్మేంద్ర ప్రధాన్ పేరు వార్తల్లో నిలిచింది. ఆయన రాజీనామా చేయాలంటూ సీజేపీ దేశవ్యాప్తంగా నిరసనలు చేపట్టి, చివరకు సాధించింది. ధర్మేంద్ర ప్రధాన్ 1969 జూన్ 26న ఒడిశాలోని తాల్చేర్‌లో జన్మించారు. కళాశాలలో చదువుతున్నప్పుడే 1983లో ఏబీవీపీ ద్వారా రాజకీయాల్లోకి వచ్చారు. 2000లో పల్లాహర నుండి ఎమ్మెల్యేగా గెలిచి, 2004లో డియోఘర్ నుండి లోక్‌సభకు ఎన్నికయ్యారు. ఆ తర్వాత బీజేవైఎం జాతీయ అధ్యక్షుడిగా, బీజేపీ జాతీయ ప్రధాన కార్యదర్శిగా ముఖ్యమైన బాధ్యతలు చేపట్టారు.

More in Politics