మమ్మల్ని కాదు.. రేపిస్టులను పట్టుకోండి!
ఉత్తరప్రదేశ్ ఆజంఘడ్లో నిరసన తెలుపుతున్న ప్రొటెస్టర్లపై పోలీసులు లాఠీఛార్జ్ చేయడంపై ఒక యువతి తీవ్రంగా ఆగ్రహం వ్యక్తం చేసింది. తమను అడ్డుకోవడం ఆపి, అసలైన రేపిస్టులను పట్టుకుంటే అత్యాచారాలు ఆగుతాయని పోలీసుల ముందే దైర్యంగా చెప్పింది. తమ హక్కులను అడగడం తప్పా అని ప్రశ్నిస్తూ, న్యాయం కావాలని డిమాండ్ చేసింది. ఈ ఘటనకు సంబంధించిన వీడియో సోషల్ మీడియాలో ప్రస్తుతం వైరల్ అవుతోంది.



