పిల్లాణ్ని చూసుకోమని చెప్తే.. దారుణానికి పాల్పడ్డాడు

ఆసుపత్రి క్యాంటీన్లో ఓ మహిళ తన ఒకటిన్నరేళ్ల కొడుకును 15 నిమిషాలు చూసుకోమని 20 ఏళ్ల యువకుడిని అడిగింది. అతను పిల్లవాడిని ఆసుపత్రి వెనుకకు తీసుకెళ్లి లైంగిక వేధింపులకు పాల్పడ్డాడు. ఈ ఇన్సిడెంట్ మధ్యప్రదేశ్ రాష్ట్రం భోపాల్లో జరిగింది. నిందితుడు పరిచయస్తుడే కావడంతో బాలుడి తల్లి నమ్మి అతనికి బిడ్డను అప్పగించింది. ఆ తర్వాత తన బిడ్డ కనిపించకపోవడంతో వెతికింది. చివరకు ఆసుపత్రి వెనక భాగంలో జరిగిన దారుణాన్ని గుర్తించి పోలీసులకు ఫిర్యాదు చేసింది. పోలీసులు అతణ్ని అరెస్ట్ చేశారు.



