ఉద్యోగులను త్వరగా ఇంటికి పంపండి: సైబరాబాద్ పోలీసులు

TG: భారీ వర్షాల హెచ్చరికలతో సైబరాబాద్ పరిధిలోని ఐటీ కంపెనీలు, ఇతర సంస్థలు ఉద్యోగులకు విడతల వారీగా ముందుగానే లాగ్అవుట్ ఇచ్చేలా చర్యలు తీసుకోవాలని సైబరాబాద్ పోలీసులు సూచించారు. దీంతో ట్రాఫిక్ రద్దీ తగ్గడంతో పాటు అత్యవసర సేవలకు అంతరాయం ఉండదని తెలిపారు. కార్యాలయ స్థానం, ముందస్తు లాగ్అవుట్ సమయాల వివరాలను trfcord@scsc.in మెయిల్కు పంపించాలని సంస్థలను కోరారు. ట్రాఫిక్ రద్దీని తగ్గించి, ప్రయాణికుల భద్రతకు, అత్యవసర సేవలకు అంతరాయం కలగకుండా చూడడమే ఈ చర్య ఉద్దేశమని తెలిపారు.



