← Back to news

హాస్టల్ విద్యార్థుల మెస్ చార్జీలు పెంచాలి

By CHANDU SPEED NEWS· 20 Aug 2026· Palasa, Palasa, Srikakulam
హాస్టల్ విద్యార్థుల మెస్ చార్జీలు పెంచాలి

AP: సంక్షేమ హాస్టల్ విద్యార్థుల మెస్‌ చార్జీలను నెలకు రూ.3 వేలకు పెంచాలని పీడీఎస్‌యూ రాష్ట్ర ప్రధాన కార్యదర్శి ఎం.వినోద్‌ డిమాండ్ చేశారు. పలాస ఆర్డీఓ అప్పలరాజుకు వినతిపత్రం అందజేశారు. పెరిగిన నిత్యావసర ధరలకు ప్రస్తుత మెస్‌ చార్జీలు సరిపోవడం లేదన్నారు. ప్రభుత్వం ప్రకటించిన 10 శాతం పెంపు సరిపోదని, 49 శాతం పెంచాలని కోరారు. పెండింగ్‌ కాస్మోటిక్‌ చార్జీలు వెంటనే విడుదల చేయాలని, గిరిజన పోస్ట్‌మెట్రిక్‌ హాస్టళ్లలో రెగ్యులర్‌ సిబ్బందిని నియమించాలని డిమాండ్ చేశారు.

More in Local