నెయ్యి తినొచ్చా !

నెయ్యి తినడం వల్ల రక్తనాళాల్లో కొవ్వు పేరుకుపోయి గుండె జబ్బులు రావు, అది పరిమితికి మించి తింటే మాత్రం ప్రమాదకరమే అని డాక్టర్ 'రెఫాయ్ షౌకత్ అలీ' (Cardiologist) చెబుతున్నారు. నెయ్యిని రోజూ తగిన మోతాదులోనే తీసుకుంటే బరువు పెరగరని, శరీరానికి కావలసిన మంచీ జరుగుతుందని అంటున్నారు. రుచిగా ఉందని చెప్పి అతిగా తీసుకుంటే శరీరంలో కొలెస్ట్రాల్, కొవ్వు బాగా పెరుగుపోతాయి. అలా పేరుకుపోయిన కొవ్వే తర్వాత గుండె సమస్యలకు దారితీస్తుందని తెలిపారు.



