1830లో ‘హిందూ మతం’ అనే పదం లేదా?

మద్రాసు ప్రెసిడెన్సీలో 1830లో క్రిమినల్ జడ్జిగా పనిచేసిన చార్లెస్ ఫిలిప్ బ్రౌన్ వద్దకు వచ్చిన కేసుల వివరాలు అప్పటి సమాజం గురించి కొత్త విషయాలు చెప్తున్నాయి. అప్పట్లో సాక్షుల వివరాలను రాసేటప్పుడు పేరు, తండ్రి పేరు, కులం, మతం, వృత్తి వంటి విషయాలను రికార్డు చేసేవారని తెలుస్తోంది. ఈ విషయాన్ని రచయిత, చరిత్ర పరిశోధకుడు బొల్లోజు బాబా తన ఫేస్బుక్ అకౌంట్లో షేర్ చేశారు. మతం అనే కాలమ్లో ‘హిందూ మతం’ అనే పదం కనిపించలేదని, దీనికి బదులుగా స్మార్తం, శైవం, రామానుజం వంటి పేర్లు మాత్రమే ఉన్నానని ఆయన వివరించారు.


