← Back to news

ఉత్పత్తి కన్నా ఉద్యోగుల భద్రతే ముఖ్యం: సింగరేణి సీఎండీ

By samson· 1d ago
ఉత్పత్తి కన్నా ఉద్యోగుల భద్రతే ముఖ్యం: సింగరేణి సీఎండీ

బొగ్గు ఉత్పత్తి కన్నా ఉద్యోగుల భద్రతే ముఖ్యమని సింగరేణి ఛైర్మన్ అండ్ ఎండీ డాక్టర్ బుద్దప్రకాష్ జ్యోతి చెప్పారు. అదే తమ మొదటి ప్రాధాన్యత అని అన్నారు. హైదరాబాద్ సింగరేణి భవన్లో గురువారం జరిగిన 50వ త్రైపాక్షిక భద్రతా సమీక్షలో ఆయన మాట్లాడుతూ.. ప్రమాద రహిత మైనింగ్ కోసం అందుబాటులో ఉన్న ఆధునిక టెక్నాలజీని వాడాలని, పొరపాట్లు మళ్లీ జరగకుండా చర్యలు తీసుకుంటామన్నారు. కార్మిక సంఘాల సూచనలను పరిగణనలోకి తీసుకుంటామని హామీ ఇచ్చారు.

ఉత్పత్తి కన్నా ఉద్యోగుల భద్రతే ముఖ్యం: సింగరేణి సీఎండీ
ఉత్పత్తి కన్నా ఉద్యోగుల భద్రతే ముఖ్యం: సింగరేణి సీఎండీ

More in Local

కరెంట్ కోసం చీకట్లో కొవ్వొత్తులతో రాస్తారోకో
Local· 40m ago

కరెంట్ కోసం చీకట్లో కొవ్వొత్తులతో రాస్తారోకో

TG: కరెంట్ కోతలతో విసిగిపోయిన మహబూబాబాద్ జిల్లా మునిగలవీడు గ్రామస్తులు చీకట్లో కొవ్వొత్తులతో రాస్తారోకో చేపట్టారు. శుక్రవారం రాత్రి మహబూబాబాద్–తొర్రూరు రహదారిపై విద్యుత్ సబ్‌స్టేషన్ ఎదుట ఆందోళన నిర్వహించడంతో వాహనాలు నిలిచిపోయాయి. ప్రభుత్వం కరెంట్ కోతలు లేవని చెబుతున్నా రోజులో పలుమార్లు విద్యుత్ సరఫరా నిలిపివేస్తున్నారని గ్రామస్తులు ఆరోపించారు. సాయంత్రం, రాత్రి వేళల్లో కోతలు ఎత్తివేయాలని డిమాండ్ చేశారు. పోలీసులు అధికారులతో మాట్లాడి విద్యుత్ సరఫరా పునరుద్ధరిస్తామని హామీ ఇవ్వడంతో ఆందోళన విరమించారు.