గ్రామంలో మురుగు నీటి కష్టాలు.. పట్టించుకోని అధికారులు

TG: వికారాబాద్ జిల్లా బషీరాబాద్ మండలం ఏక్మై గ్రామంలోని 10వ వార్డులో డ్రైనేజీ పూడుకుపోవడంతో మురుగు నీరు రోడ్డుపై నిలిచిపోయి ప్రజలు తీవ్ర ఇబ్బందులు పడుతున్నారు. మురుగు కాల్వలో గడ్డి, చెత్త పేరుకుపోవడంతో డ్రైనేజీ నీరు సక్రమంగా ప్రవహించక దుర్వాసన వెదజల్లుతోంది. నీరు నిలిచిపోవడంతో దోమల బెడద కూడా పెరిగిందని స్థానికులు ఆవేదన వ్యక్తం చేస్తున్నారు. ముఖ్యంగా చిన్నారులు, వృద్ధులు అనారోగ్యానికి గురవుతున్నారని తెలిపారు. సమస్యను వెంటనే పరిష్కరించాలని గ్రామపంచాయతీ అధికారులను కోరారు.



