అలా వండితే..చేప వెజిటేరియనే: యూపీ మంత్రి

చేప వెజిటేరియన్ ఆహారమే అంటూ ఉత్తరప్రదేశ్ మంత్రి, నిషాద్ పార్టీ అధినేత సంజయ్ నిషాద్ సంచలన కామెంట్ చేశారు. ‘బదల్తా పూర్వీ ఉత్తరప్రదేశ్’ ఈవెంట్లో ఆయన మాట్లాడుతూ వెల్లుల్లి, ఉల్లిపాయ లేకుండా వండిన చేపల కూర శాకాహారమే అన్నారు. గతంలో తను ఈ మాట చెప్పినప్పుడు ఏ మహారాజ్ జీ కూడా దీన్ని కౌంటర్ చేయలేదని, వాళ్ల మౌనమే అంగీకారమని ఆయన సమర్థించుకున్నారు. ఈ విషయం నెట్లో వైరల్ అయ్యింది.



