చర్చకు మేం సిద్ధం..ప్రతిపక్షం అడ్డుకుంటోంది: అమిత్ షా
పార్లమెంట్ సమావేశాలు స్టార్ట్ అయినప్పటినుంచి ప్రతిపక్షం రెండు సభల్లోనూ గందరగోళం చేస్తోందని, అందుకే సభలోకి వెళ్లడం వల్ల ప్రయోజనం లేదని హోం మంత్రి అమిత్ షా ఆరోపించారు. ‘మిస్సింగ్’, ‘ఫ్యూజిటివ్స్’ లాంటి పదాలు ఇటీవల పార్లమెంటరీ చర్చల్లో వినిపించడం మొదలైందని అన్నారు. NEET విద్యార్థుల నిరసనలతోసహా అన్ని అంశాలపై చర్చకు ప్రభుత్వం సిద్ధమేనన్న విషయం పార్లమెంటరీ వ్యవహారాల మంత్రి కిరెన్ రిజిజు ఇప్పటికే చెప్పారన్నారు. అయినా ప్రతిపక్షమే అడ్డుకొంటోందని అన్నారు.



