← Back to news

రైతుల పంటలకు మెరుగైన మార్కెటింగ్‌ సదుపాయాలు

By epuri rajaratnam· 27 Aug 2026
రైతుల పంటలకు మెరుగైన మార్కెటింగ్‌ సదుపాయాలు

AP: రైతులు పండించిన పంటలకు మెరుగైన మార్కెటింగ్‌ సదుపాయాలు కల్పించేందుకు మంగళగిరిలో మోడల్‌ రైతుబజారు నిర్మాణానికి శ్రీకారం చుట్టారు. గుంటూరు జిల్లా మంగళగిరి నిడమర్రు రోడ్డులో 5.90 ఎకరాల విస్తీర్ణంలో రూ.18 కోట్లతో నిర్మించనున్న రైతుబజారుకు మంత్రి నారా లోకేష్‌ శంకుస్థాపన చేశారు. రైతులు పండించిన కూరగాయలు, పండ్లు, పూలను నేరుగా విక్రయించుకునేలా రిటైల్‌, హోల్‌సేల్‌ మార్కెట్లు ఏర్పాటు చేయనున్నారు. కోల్డ్‌ స్టోరేజీ, వెజిటబుల్‌ వాష్‌ ఏరియా వంటి ఆధునిక సదుపాయాలు అందుబాటులోకి రానున్నాయి.

More in Local