చెన్నై బయో-సిఎన్జి ప్లాంట్లో సీఎం విజయ్ ఆకస్మిక తనిఖీ

తమిళనాడు ముఖ్యమంత్రి సి. జోసెఫ్ విజయ్ చెన్నైలోని చేట్పెట్ బయో-సిఎన్జి ప్లాంట్ను ఆకస్మికంగా తనిఖీ చేశారు. తడి చెత్తను బయో-సిఎన్జి, సేంద్రీయ ఎరువుగా మార్చే విధానాన్ని పరిశీలించి అధికారులకు పలు సూచనలు చేశారు. నగరంలో రోజూ వచ్చే 6,150 టన్నుల చెత్తను శాస్త్రీయంగా ప్రాసెస్ చేయాలని, ప్లాస్టిక్ వ్యర్థాలను రోడ్ల నిర్మాణం, సిమెంట్ పరిశ్రమల్లో ఇంధనంగా వాడాలని ఆదేశించారు. ఇదే తరహా బయో-సిఎన్జి ప్లాంట్లను రాష్ట్రవ్యాప్తంగా అన్ని పట్టణ స్థానిక సంస్థల్లో నిర్ణీత గడువులోగా ఏర్పాటు చేయాలని సీఎం విజయ్ స్పష్టం చేశారు.



