భూబాధితులకు న్యాయం చేయాలి.. కలెక్టర్కు సీపీఎం ఫిర్యాదు

AP: తిరుపతిలో భూసమస్యపై సీపీఎం నాయకులు ఆందోళన చేశారు. శెట్టిపల్లిలో ల్యాండ్ పూలింగ్ ద్వారా ప్రభుత్వం భూములు తీసుకున్నప్పటికీ అర్హులైన లబ్ధిదారులకు వారి వాటా భూమికి సంబంధించిన ప్రొసీడింగ్స్ మంజూరు చేయడంలో జాప్యం జరుగుతోందని సీపీఎం జిల్లా కార్యదర్శి వందవాసి నాగరాజు ఆరోపించారు. గ్రీవెన్స్ డే సందర్భంగా భూ బాధితులతో కలిసి జిల్లా కలెక్టర్కు ఫిర్యాదు చేశారు. సమస్యపై ఇప్పటికే సుమారు 40 సార్లు అర్జీలు ఇచ్చినా పరిష్కారం కాలేదన్నారు.





