← Back to news

కుక్క భయంతో బావిలో పడిన బాలిక.. చివరికి ఇలా!

By Mahesh· 22 Aug 2026· Uttar Pradesh

ఉత్తరప్రదేశ్‌ రాష్ట్రం ఫరూఖాబాద్ జిల్లా కైమ్‌గంజ్‌లో షాకింగ్ ఘటన జరిగింది. స్కూల్ నుంచి ఇంటికి వస్తున్న బాలికను ఓ కుక్క వెంబడించింది. భయంతో బాలిక బావి వైపు వెళ్లింది. 50 అడుగుల లోతైన బావిలో పడిపోయింది. స్థానికులు సమాచారంతో పోలీసులు, రెస్క్యూ టీమ్ అక్కడికి చేరుకున్నారు. అధికారులు ఆక్సిజన్ మాస్క్‌తో బావిలోకి దిగి బాలికను సేఫ్‌గా బయటకు తీసుకొచ్చారు. తరువాత హాస్పిటల్‌కు తీసుకెళ్లారు. ప్రస్తుతం బాలిక పరిస్థితి బాగానే ఉందని అధికారులు తెలిపారు.

More in National

జంతర్ మంతర్ దాడి కేసు.. అదుపులో స్వతంత్ర భారద్వాజ్
National· 6h ago

జంతర్ మంతర్ దాడి కేసు.. అదుపులో స్వతంత్ర భారద్వాజ్

CJP ప్రొటెస్ట్‌లో దాడి చేశారని ఆరోపణలు ఎదుర్కొంటున్న యాక్టివిస్ట్ స్వతంత్ర భారద్వాజ్‌ను UPలో పోలీసులు డిటెయిన్ చేశారు. బులంద్‌షహర్‌లో ఆయనను అదుపులోకి తీసుకున్నట్లు తెలుస్తోంది. జంతర్ మంతర్ ప్రొటెస్ట్‌లో నిషు ఆజాద్ తండ్రి సంజయ్ కుమార్‌తో గొడవ జరిగిందని, ఆయనపై దాడి చేశారనే ఆరోపణలు ఉన్నాయి. దాడి కేసులో CJP ప్రతినిధులు <a href="https://www.theclearcutnews.com/n/WKSsto7">పార్లమెంట్ స్ట్రీట్ పోలీస్ స్టేషన్‌కు</a> వెళ్లారు. మర్డర్ అటెంప్ట్ సెక్షన్, SC/ST యాక్ట్‌ కింద కేసు పెట్టాలని పోలీసులను కోరారు. దీంతో పోలీసులు యాక్షన్ తీసుకున్నట్లు తెలుస్తోంది.