కుక్క భయంతో బావిలో పడిన బాలిక.. చివరికి ఇలా!
ఉత్తరప్రదేశ్ రాష్ట్రం ఫరూఖాబాద్ జిల్లా కైమ్గంజ్లో షాకింగ్ ఘటన జరిగింది. స్కూల్ నుంచి ఇంటికి వస్తున్న బాలికను ఓ కుక్క వెంబడించింది. భయంతో బాలిక బావి వైపు వెళ్లింది. 50 అడుగుల లోతైన బావిలో పడిపోయింది. స్థానికులు సమాచారంతో పోలీసులు, రెస్క్యూ టీమ్ అక్కడికి చేరుకున్నారు. అధికారులు ఆక్సిజన్ మాస్క్తో బావిలోకి దిగి బాలికను సేఫ్గా బయటకు తీసుకొచ్చారు. తరువాత హాస్పిటల్కు తీసుకెళ్లారు. ప్రస్తుతం బాలిక పరిస్థితి బాగానే ఉందని అధికారులు తెలిపారు.



