కొండగట్టు ప్రమాదంపై సమగ్ర దర్యాప్తు.. పోలీసులకు SP ఆదేశాలు

TG: జగిత్యాల జిల్లా కొండగట్టు వద్ద రోడ్డు <a href="https://www.theclearcutnews.com/n/MJPz7jK">ప్రమాద</a> స్థలాన్ని జిల్లా ఎస్పీ అశోక్ కుమార్ పరిశీలించారు. కరీంనగర్–జగిత్యాల ప్రధాన రహదారిపై జరిగిన ప్రమాదానికి దారితీసిన పరిస్థితులపై పోలీసు అధికారులను అడిగి వివరాలు తెలుసుకున్నారు. రహదారి పరిస్థితి, వాహనాల కదలిక, వాహనాల వేగం తదితర అంశాలను పరిశీలించారు. ప్రమాదానికి గల కారణాలను అన్ని కోణాల్లో విచారించి సమగ్ర దర్యాప్తును వేగవంతం చేయాలని అధికారులను ఆదేశించారు. రహదారులపై వాహనదారులు అప్రమత్తంగా వ్యవహరించాలని సూచించారు.



