రాహుల్ గాంధీ ధర్నా చేసినా FIR నమోదుకు 8 గంటలు
ఢిల్లీ నిరసనల్లో పెల్లెట్ గన్ కాల్పుల్లో గాయపడ్డ విద్యార్థి సాహిల్ లోచబ్ శరీరంపై 200 పెల్లెట్స్ ఉన్నాయని మెడికల్ రిపోర్ట్ వచ్చింది. దీంతో సాహిల్ కు న్యాయం చేయాలని ప్రతిపక్ష నేత రాహుల్ గాంధీ పార్లమెంట్ పోలీస్ స్టేషన్ ముందు ధర్నా చేశారు. FIR నమోదయ్యేదాకా కదిలేది లేదని పట్టుబట్టడంతో పోలీసులు FIR చేశారు. బాధితుడు సాహిల్ స్పందిస్తూ 'నా ఒంట్లో 200 గాయాలున్నా FIR కోసం 8 గంటలు పట్టింది. లోక్సభ ప్రతిపక్ష నేత (LOP) అండగా నిలబడకపోతే పోలీసులు అసలు కేసు నమోదు చేసే వారే కాదు" అని ఆవేదన వ్యక్తం చేశాడు.



