విద్యా వ్యవస్థ మార్చాల్సిందే: నేహా బోరా

AP: కేంద్ర విద్యాశాఖ మంత్రి ధర్మేంద్ర ప్రధాన్ రాజీనామా చేసినంత మాత్రాన సమస్యలు పరిష్కారం కావని AISA జాతీయ అధ్యక్షురాలు, జెన్ జీ ఉద్యమ నేత నేహా బోరా అన్నారు. విజయవాడ ప్రెస్క్లబ్లో జరిగిన మీట్ ది ప్రెస్లో ఆమె మాట్లాడారు. దేశ విద్యా వ్యవస్థలో సమూల మార్పులు తీసుకురావాల్సిన అవసరం ఉందని పేర్కొన్నారు. నీట్ పేపర్ లీక్, పరీక్ష రద్దు వ్యవహారాల్లో కేంద్రం నిర్లక్ష్యంగా వ్యవహరించిందని విమర్శించారు. ఢిల్లీలో నిరాహార దీక్ష సందర్భంగా తమను రెచ్చగొట్టేందుకు ప్రయత్నించారని ఆరోపించారు.



