← Back to news

OU పరీక్షల మూల్యాంకనంపై విద్యార్థులు ఫైర్

By DK· 11 Jun 2026· Dishadaily· హైదరాబాద్‌
OU పరీక్షల మూల్యాంకనంపై విద్యార్థులు ఫైర్

TG: : ఉస్మానియా యూనివర్సిటీ పరీక్షల మూల్యాంకనంపై విద్యార్థులు ఆగ్రహం వ్యక్తం చేస్తున్నారు. ఇటీవల విడుదలైన LLB సెమిస్టర్ ఫలితాల్లో పెద్దసంఖ్యలో విద్యార్థులు ఫెయిల్ కావడం, అనంతరం రీవాల్యుయేషన్‌లో వారిలో ఎక్కువమంది పాస్ కావడంతో పేపర్ ఎవల్యూషన్‌పై అనుమానాలు వ్యక్తమవుతున్నాయి. విద్యార్థుల సమాచారం ప్రకారం LLB సెమిస్టర్ పరీక్షల్లో సుమారు 1,500 మంది ఫెయిలయ్యారు. వీరిలో గత సెమిస్టర్లలో మంచి మార్కులు సాధించిన వారు కూడా ఉండటంతో అనుమానాలు వ్యక్తమయ్యాయి. మొదట ఫెయిలైనవారికి రీవాల్యుయేషన్ అనంతరం ఫస్ట్ గ్రేడ్ మార్కులు వచ్చాయి.

More in Education