నేపాల్ వరద బాధితులకు సోనూసూద్ సాయం
నేపాల్ వరద బాధితులకు సాయం చేసేందుకు నటుడు సోనూసూద్ తన టీంతో కలిసి కాఠ్మాండుకు చేరుకున్నారు. బాధితులకు నిత్యావసర వస్తువులు అందించేందుకు వచ్చినట్లు తెలిపారు. భారత్ నుంచి నేపాల్కు సహాయం పంపడం రిస్క్తో కూడుకున్నప్పటికీ, బాధితుల అవసరాలను తెలుసుకుని సాయం అందిస్తామని చెప్పారు. వారి జీవితాలను తిరిగి నిర్మించుకునేందుకు హెల్ప్ చేయడం మనందరి బాధ్యత అని వివరించారు.



