ఒక్క నెలలో..60 మంది నవజాత శిశువులు మృతి

పశ్చిమ బెంగాల్లోని మాల్డా మెడికల్ కాలేజ్ అండ్ హాస్పిటల్లో ఆగస్టులో 60 నవజాత శిశువులు చనిపోయారు. ఇందులో 10 మంది ఆగస్టు రెండో వారంలోనే చనిపోయారు. 60 మందిలో 44 మంది ఇతర హాస్పిటల్స్ లేదా నర్సింగ్ హోమ్ల నుంచి క్రిటికల్ కండీషన్లలో ఇక్కడికి తీసుకొచ్చారు. మిగిలిన 16 మంది ఈ హాస్పిటల్లోనే పుట్టారు. వాళ్లు ఇక్కడికి రావడానికి ముందే అనారోగ్యంతో ఉన్నారని, అందుకే మరణించారని హాస్పిటల్ వర్గాలు చెప్తున్నాయి. జిల్లా అధికారులు ఈ అంశాన్ని పరిశీలిస్తున్నాయి.



