← Back to news

ప్రభుత్వ హాస్టల్ గోడ కూలి 8వ తరగతి స్టూడెంట్ మృతి

By Vishi· 24 Aug 2026

AP: అనంతపురం జిల్లా కళ్యాణదుర్గం నియోజకవర్గం శెట్టూరు గ్రామంలోని ప్రభుత్వ ఎస్సీ బాయ్స్ హాస్టల్ వద్ద ఆదివారం తీవ్ర విషాదం నెలకొంది. హాస్టల్ పక్కన ఉన్న కాంపౌండ్ వాల్ కూలిపోవడంతో 8వ తరగతి విద్యార్థి హర్షవర్ధన్ మృతి చెందాడు. అతని తండ్రి ఆవేదనతో “లేవు నాన్నా. నీవు లేకుండా నేనేం చేయాలి?” అని ఏడవటం అందర్నీ కంటతడి పెట్టిస్తోంది. మరో విద్యార్థి అక్షయ్ కాలు విరగడంతో చికిత్స పొందుతున్నాడు.

More in Current Affairs