కన్నీళ్లు పెట్టిస్తున్న విద్యార్థి చివరి మాటలు!

మరో నీట్ అభ్యర్థి చదువు, భవిష్యత్తుపై ఒత్తిడి తట్టుకోలేక ఆత్మహత్య చేసుకున్నాడు. మహారాష్ట్రలోని శంభాజీనగర్లో సూరజ్ సుభాష్ షిండే (19) అనే విద్యార్థి 'అమ్మ, నాన్న క్షమించండి, వచ్చే జన్మలో ఖచ్చితంగా డాక్టర్ అవుతాను. జాగ్రత్తగా, సంతోషంగా ఉండండి' అని సూసైడ్ నోట్లో రాసి ఇంట్లో ఉరేసుకున్నాడు.



