← Back to news

ధాన్యం బస్తాలు దహనం చేసి నిరసన

By dk yamjala· 27 May 2026
ధాన్యం బస్తాలు దహనం చేసి నిరసన

TG: మెదక్ జిల్లా వెల్దుర్తి మండలం ఉప్పు లింగాపూర్ వద్ద రైతులు ఆందోళన చేపట్టారు. ధాన్యం కొనుగోలు చేయాలని డిమాండ్ చేస్తూ మెదక్ - వెల్దుర్తి ప్రధాన రహదారిపై ధాన్యం బస్తాలు దహనం చేసి నిరసన తెలిపారు. గత నెల రోజులుగా కొనుగోలు కేంద్రాల వద్ద ఇబ్బంది పడుతున్నామని, అధికారులు పట్టించుకోవడం లేదంటూ ఆగ్రహం వ్యక్తం చేశారు. అధికారులు వచ్చి ధాన్యం కొనుగోలు చేసే వరకు తాము వెళ్ళమంటూ రోడ్డుపై గ్యాస్ పొయ్యి పెట్టి నిరసన కార్యక్రమాన్ని చేపట్టారు. జిల్లా కలెక్టర్ రావాలంటూ నినాదాలు చేశారు. పోలీసులను సైతం అక్కడి నుండి వెళ్లకుండా అడ్డుకున్నారు.

ధాన్యం బస్తాలు దహనం చేసి నిరసన

More in Local