← Back to news

డీజే సౌండ్‌కి 16 ఏళ్ల బాలుడు బలి

By Gautham sattva· 2d ago· Telangana
డీజే సౌండ్‌కి 16 ఏళ్ల బాలుడు బలి

నారాయణపేట జిల్లా కోస్గి మున్సిపాలిటీ పరిధిలోని పోతిరెడ్డిపల్లిలో తీవ్ర విషాదం జరిగింది. ఆదివారం రోజు గొల్ల మల్లప్ప కూతురి వివాహం జరగ్గా, సోమవారం రాత్రి డీజే బ్యాండ్ నిర్వహించారు. ఈ వేడుకలో డ్యాన్స్ చేస్తూ రవితేజ (16) అనే బాలుడు డీజే సౌండ్ తట్టుకోలేక గుండెపోటుతో అక్కడికక్కడే కుప్పకూలాడు. గమనించిన స్థానికులు వెంటనే అతడిని కోస్గి హాస్పిటల్‌కి తరలించగా, అప్పటికే బాలుడు చనిపోయాడని డాక్టర్లు కన్ఫర్మ్ చేశారు. ఈ ఇన్సిడెంట్ పై ఇప్పటివరకు ఎలాంటి కంప్లైంట్ అందలేదని పోలీసులు క్లారిటీ ఇచ్చారు.

More in Current Affairs