డీజే సౌండ్కి 16 ఏళ్ల బాలుడు బలి

నారాయణపేట జిల్లా కోస్గి మున్సిపాలిటీ పరిధిలోని పోతిరెడ్డిపల్లిలో తీవ్ర విషాదం జరిగింది. ఆదివారం రోజు గొల్ల మల్లప్ప కూతురి వివాహం జరగ్గా, సోమవారం రాత్రి డీజే బ్యాండ్ నిర్వహించారు. ఈ వేడుకలో డ్యాన్స్ చేస్తూ రవితేజ (16) అనే బాలుడు డీజే సౌండ్ తట్టుకోలేక గుండెపోటుతో అక్కడికక్కడే కుప్పకూలాడు. గమనించిన స్థానికులు వెంటనే అతడిని కోస్గి హాస్పిటల్కి తరలించగా, అప్పటికే బాలుడు చనిపోయాడని డాక్టర్లు కన్ఫర్మ్ చేశారు. ఈ ఇన్సిడెంట్ పై ఇప్పటివరకు ఎలాంటి కంప్లైంట్ అందలేదని పోలీసులు క్లారిటీ ఇచ్చారు.


