బిర్యానీ, పుచ్చకాయ తిని ముంబైలో నలుగురు మృతి!

ముంబైలో ఒకే కుటుంబానికి చెందిన నలుగురు వ్యక్తులు మృతి చెందడం సంచలనంగా మారింది. బిర్యానీ మరియు పుచ్చకాయ (Watermelon) తిన్న తర్వాత వారి ఆరోగ్యం క్షీణించిందని సమాచారం. బాధితుల కిడ్నీలు దారుణంగా దెబ్బతిన్నట్లు డాక్టర్లు గుర్తించారు. ఆహారంలో విషపూరిత కెమికల్స్ ఉన్నాయా అనే కోణంలో పోలీసులు Investigation చేస్తున్నారు. సమ్మర్లో ఆహారం విషయంలో జాగ్రత్తగా ఉండాలని నిపుణులు హెచ్చరిస్తున్నారు.



