ఫ్లైట్స్ భోగాపురానికి.. కార్మికులు రోడ్డుపైకి!
AP: విశాఖపట్నం ఎయిర్ పోర్టులో ఔట్సోర్సింగ్ కార్మికులు ఆందోళనకు దిగారు. భోగాపురం ఇంటర్నేషనల్ ఎయిర్ పోర్టుకు నేటి నుంచి విమాన సర్వీసులు తరలిపోవడంతో తమ ఉపాధి కోల్పోయామని పోర్టర్లు, శానిటేషన్ వర్కర్లు ఆవేదన వ్యక్తం చేశారు. 20 నుంచి 30 ఏళ్లుగా విశాఖ ఎయిర్పోర్టులో పనిచేస్తున్న తమను ఇప్పుడు కాంట్రాక్టర్లు పట్టించుకోవడం లేదని కన్నీరు పెట్టుకున్నారు. ఎయిర్ పోర్టు మూసివేతతో రోడ్డున పడ్డ తమకు ప్రభుత్వమే ఉపాధి కల్పించి ఆదుకోవాలని కార్మికులు కోరారు.


