← Back to news

HPS భూమి కేసులో హైకోర్టు కాంటెంప్ట్ నోటీసు!

By Vara Prasad· 2d ago
HPS భూమి కేసులో హైకోర్టు కాంటెంప్ట్ నోటీసు!

హైదరాబాద్‌లోని బేగంపేట HPS సొసైటీలో 100 ఎకరాల ప్రభుత్వ భూమి మాయమైందని ఆరోపణ! హైకోర్టు ఆదేశాలు పాటించకపోవడంతో ఎడ్యుకేషన్ సెక్రటరీకి కాంటెంప్ట్ నోటీసు జారీ అయింది. ఒక ప్రజా ప్రయోజన వ్యాజ్యాన్ని విచారించిన సందర్భంగా మూడు నెలల్లోగా నివేదిక ఇవ్వాలని గతంలో కోర్టు ఆదేశించింది.. కానీ ఆ ఆదేశాన్ని పాటించలేదు. అందుకే, తాజాగా సిజే నేతృత్వంలోని ధర్మాసనం ఈ నోటీసు జారీ చేసింది.

More in Local

కరెంట్ కోసం చీకట్లో కొవ్వొత్తులతో రాస్తారోకో
Local· 6h ago

కరెంట్ కోసం చీకట్లో కొవ్వొత్తులతో రాస్తారోకో

TG: కరెంట్ కోతలతో విసిగిపోయిన మహబూబాబాద్ జిల్లా మునిగలవీడు గ్రామస్తులు చీకట్లో కొవ్వొత్తులతో రాస్తారోకో చేపట్టారు. శుక్రవారం రాత్రి మహబూబాబాద్–తొర్రూరు రహదారిపై విద్యుత్ సబ్‌స్టేషన్ ఎదుట ఆందోళన నిర్వహించడంతో వాహనాలు నిలిచిపోయాయి. ప్రభుత్వం కరెంట్ కోతలు లేవని చెబుతున్నా రోజులో పలుమార్లు విద్యుత్ సరఫరా నిలిపివేస్తున్నారని గ్రామస్తులు ఆరోపించారు. సాయంత్రం, రాత్రి వేళల్లో కోతలు ఎత్తివేయాలని డిమాండ్ చేశారు. పోలీసులు అధికారులతో మాట్లాడి విద్యుత్ సరఫరా పునరుద్ధరిస్తామని హామీ ఇవ్వడంతో ఆందోళన విరమించారు.