హైడ్రా కమిషనర్పై హైకోర్టు సెన్సేషనల్ ఆర్డర్స్!

ఆర్మీ భూముల విషయంలో హైడ్రా కమిషనర్ రంగనాథ్పై హైకోర్టు సీరియస్ అయింది. ఆర్మీ భూముల్లోకి ప్రవేశిస్తే రంగనాథ్ను అరెస్ట్ చేయాలని, అధికారులకు సంకెళ్లు వేయాలని ఆదేశించింది. కోర్టు ధిక్కరణ కొనసాగితే ఆర్మీ కస్టడీకి అప్పగిస్తామని హెచ్చరించింది. వివాదాస్పద భూమి దగ్గర 10 మంది ఆర్మీ జవాన్లు రక్షణగా ఉండాలని, హైడ్రా అధికారులు వస్తే అదుపులోకి తీసుకుని వారి వాహనాలను సీజ్ చేయాలని స్పష్టం చేసింది. అవసరమైతే కమిషనర్ను ఆర్మీ బ్యారక్స్లో ఉంచాలని కామెంట్స్ చేసింది.



