సంక్షేమ విద్యార్థులకు కార్పొరేట్ స్థాయి సౌకర్యాలు : మంత్రి

జగిత్యాల జిల్లా కుమ్మరిపల్లిలోని కస్తూర్బా గాంధీ పాఠశాలలో మంత్రి అడ్లూరి లక్ష్మణ్ కుమార్ గురువారం రూ.67 లక్షల పనులకు శంకుస్థాపన చేశారు. ఆయన విద్యార్థులతో భోజనం చేసి, వారికి షూస్, బ్యాగులు అందించారు. సంక్షేమ విద్యార్థులకు కార్పొరేట్ స్థాయి సౌకర్యాలే ప్రభుత్వ లక్ష్యమని మంత్రి అన్నారు. తహసీల్దార్లు, ఎంపీడీవోలు వారానికి ఒక రోజు పాఠశాలలు, వసతి గృహాలను తనిఖీ చేయాలని ఆదేశించారు. నాణ్యమైన విద్య, పౌష్టికాహారం అందించాలని సూచించారు.




