← Back to news

సంక్షేమ విద్యార్థులకు కార్పొరేట్ స్థాయి సౌకర్యాలు : మంత్రి

By Srikanth· 1d ago· Velgatur, Velgatur, Jagitial
సంక్షేమ విద్యార్థులకు కార్పొరేట్ స్థాయి సౌకర్యాలు : మంత్రి

జగిత్యాల జిల్లా కుమ్మరిపల్లిలోని కస్తూర్బా గాంధీ పాఠశాలలో మంత్రి అడ్లూరి లక్ష్మణ్ కుమార్ గురువారం రూ.67 లక్షల పనులకు శంకుస్థాపన చేశారు. ఆయన విద్యార్థులతో భోజనం చేసి, వారికి షూస్, బ్యాగులు అందించారు. సంక్షేమ విద్యార్థులకు కార్పొరేట్ స్థాయి సౌకర్యాలే ప్రభుత్వ లక్ష్యమని మంత్రి అన్నారు. తహసీల్దార్లు, ఎంపీడీవోలు వారానికి ఒక రోజు పాఠశాలలు, వసతి గృహాలను తనిఖీ చేయాలని ఆదేశించారు. నాణ్యమైన విద్య, పౌష్టికాహారం అందించాలని సూచించారు.

సంక్షేమ విద్యార్థులకు కార్పొరేట్ స్థాయి సౌకర్యాలు : మంత్రి

More in Local

కరెంట్ కోసం చీకట్లో కొవ్వొత్తులతో రాస్తారోకో
Local· 2h ago

కరెంట్ కోసం చీకట్లో కొవ్వొత్తులతో రాస్తారోకో

TG: కరెంట్ కోతలతో విసిగిపోయిన మహబూబాబాద్ జిల్లా మునిగలవీడు గ్రామస్తులు చీకట్లో కొవ్వొత్తులతో రాస్తారోకో చేపట్టారు. శుక్రవారం రాత్రి మహబూబాబాద్–తొర్రూరు రహదారిపై విద్యుత్ సబ్‌స్టేషన్ ఎదుట ఆందోళన నిర్వహించడంతో వాహనాలు నిలిచిపోయాయి. ప్రభుత్వం కరెంట్ కోతలు లేవని చెబుతున్నా రోజులో పలుమార్లు విద్యుత్ సరఫరా నిలిపివేస్తున్నారని గ్రామస్తులు ఆరోపించారు. సాయంత్రం, రాత్రి వేళల్లో కోతలు ఎత్తివేయాలని డిమాండ్ చేశారు. పోలీసులు అధికారులతో మాట్లాడి విద్యుత్ సరఫరా పునరుద్ధరిస్తామని హామీ ఇవ్వడంతో ఆందోళన విరమించారు.