అన్నదాతలను ఆదుకుంటా: చంద్రబాబు

AP: రైతు కష్టంలో తోడుంటానని, ప్రతి ఒక్కరినీ ఆదుకుంటానని CM చంద్రబాబు పేర్కొన్నారు. పల్నాడు జిల్లా చిలకలూరిపేట మండలం లింగంగుంట్లలో 'పీఎం కిసాన్- అన్నదాత సుఖీభవ' సాయం కింద 2026 ఖరీఫ్ సీజన్కు 46.86 లక్షల మంది రైతుల ఖాతాలకు ఒక్కొక్కరికి రూ.7 వేల చొప్పున రూ.3,125 కోట్ల ఆర్థికసాయం విడుదల చేశారు. రైతులు తల్లిలాంటి భూమిని.. రసాయన ఎరువులు, క్రిమిసంహారక మందులు విరివిగా వాడకుండా కాపాడుకోవాలని సూచించారు. ప్రకృతి సేద్యంతో సాగును మరింత పరిపుష్టం చేయాలన్నారు.



