కోర్టు వీడియోలు సోషల్ మీడియాలో షేర్ చేయొద్దు: సుప్రీం కోర్టు

ఇకపై కోర్టు విచారణ వీడియోలను సోషల్ మీడియాలో ఇష్టమొచ్చినట్లు షేర్ చేయడానికి వీల్లేదని సుప్రీం కోర్టు సీరియస్ అయ్యింది. కోర్టు పర్మిషన్ లేకుండా వీడియోలు పోస్ట్ చేసినా, మోనెటైజ్ చేసినా యాక్షన్ తప్పదని వార్నింగ్ ఇచ్చింది. కోర్టులేమీ 24 గంటలు నడిచే ఎంటర్టైన్మెంట్ ఛానల్స్ కావని జడ్జీలు గట్టిగా కామెంట్ చేశారు. ఈ విషయాన్నే తీవ్రంగా పరిగణించిన కోర్టు.. మెటా, ఎక్స్ వంటి సోషల్ మీడియా ప్లాట్ఫామ్లకు నోటీసులు జారీ చేసింది. అయితే, నార్మల్ న్యూస్ రిపోర్టింగ్కి మాత్రం ఈ రూల్ వర్తించదని క్లారిటీ ఇచ్చింది.



