పంచదార(చక్కెర) నిల్వలపై కేంద్రం కొత్త రూల్స్

కొద్ది రోజులుగా పంచదార(చక్కెర) ధరలు పెరుగుతున్నాయి. ఉత్పత్తి తగ్గడంతో సప్లై తగ్గినట్టు వ్యాపారులు చెప్తున్నారు. ఈ టైంలో కేంద్రం కీలక నిర్ణయం తీసుకుంది. పంచదార నిల్వలపై ఆంక్షలు విధించింది. నెలకు 10 మెట్రిక్ టన్నుల కంటే ఎక్కువ పంచదారను ముడిసరుకుగా వాడే ఏ బల్క్ వినియోగదారుడైనా 15 రోజులకు మించి నిల్వలు ఉంచుకోకూడదని ఆర్డర్ ఇచ్చింది. సెప్టెంబర్ 1 నుంచి నవంబర్ 30 వరకు ఈ రూల్స్ అమల్లోకి ఉంటాయని చెప్పింది. 10 లక్షల మెట్రిక్ టన్నుల చక్కెర దిగుమతులపై సుంకాన్ని పూర్తిగా రద్దు చేసింది.



